News February 11, 2025

జేఈఈ మెయిన్-2025 ఆలిండియా టాపర్‌గా భాష్యం విద్యార్థిని

image

జేఈఈ మెయిన్-2025 జనవరి ఫలితాలలో భాష్యం అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. సెషన్-1 ఫలితాలలో భాష్యం విద్యార్థి గుత్తికొండ సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించిన ఏకైక తెలుగు విద్యార్థిగా నిలిచింది. మరెంతో మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. భాష్యం ప్రత్యేక కరికులంతోనే ఈ విజయం సాధ్యమైందని తెలుయజేస్తూ.. విద్యార్థులను, అధ్యాపకులను సంస్థ యాజమాన్యం అభినందించింది.

Similar News

News February 11, 2025

వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ ఆవిష్కరణ

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్‌ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.

News February 11, 2025

గుంటూరులో పల్నాడు మిర్చిరైతుల ధర్నా !

image

పల్నాడు జిల్లా గ్రంథసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చియార్డు వద్ద ధర్నాకు దిగారు. యార్డులోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గతేడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటూ అదనంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఐదుగురు రైతుల వద్ద రూ.10లక్షల చొప్పున మొత్తం రూ.50 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

News February 11, 2025

వైసీపీ కార్యాలయానికి మరోసారి నోటీసులు

image

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన రోజు కార్యాలయానికి వచ్చిన సందర్శకులు, నేతల జాబితా ఇవ్వాలని పార్టీ కార్యాలయ వర్గాలను పోలీసులు కోరారు. అలాగే సీసీ కెమెరా డేటా, పార్కింగ్ లోని వాహనాల వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి పీఎస్‌కు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

error: Content is protected !!