News November 18, 2025
జేఎన్టీయూలో తినే ఆహారంలో పురుగులు

కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో మరోసారి పురుగులు దర్శనమిచ్చాయి. సోమవారం రాత్రి హాస్టల్లో అన్నం తినే సమయంలో పురుగులు కనిపించాయని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.
Similar News
News November 18, 2025
కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.
News November 18, 2025
కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.


