News April 9, 2024
జైనూర్: దగ్గు, దమ్ముతో నిండు గర్భిణీ మృతి !

జైనూర్ మండలం లక్ష్మణ్ పటేల్గూడకు చెందిన ఆత్రం లక్ష్మి(30) అనే నిండు గర్భిణీ దగ్గు, దమ్ముతో అకస్మాత్తుగా మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాలు.. లక్ష్మీకి దమ్ము, దగ్గు అధికం కావడంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు.. ఆక్సిజన్ ద్వారా 108లో మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఒకేసారి దమ్ము, దగ్గు రావడంతో చనిపోయిందని చెప్పారు.
Similar News
News September 9, 2025
ఉట్నూర్: ‘ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం’

ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ టీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ కలిసి ప్రారంభించారు. నిష్ణాతులైన సిబ్బంది ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తామని తెలిపారు. రాత్రి సమయంలోనూ దృశ్యాలు కనిపిస్తాయన్నారు.
News September 9, 2025
రేపు చాకలి ఐలమ్మ వర్ధంతి: ఆదిలాబాద్ కలెక్టర్

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 10న అధికారికంగా నిర్వహించనున్నామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కావున రిమ్స్ ఆసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించే వర్ధంతి కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ, రజక సంఘాల నాయకులు, ప్రజలు హాజరవ్వాలని కోరారు.
News September 9, 2025
ఆదిలాబాద్: అధ్యాపక పోస్టుకు డెమోకు ఆహ్వానం

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్లో ఖాళీగా ఉన్న తెలుగు అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు నేరుగా డెమోకు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ డా.జె.సంగీత పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 11వ తేదీ గురువారం కళాశాలలో జరిగే డెమోకు నేరుగా హాజరు కావాలని పేర్కొన్నారు.