News February 8, 2025
జైనూర్: విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ భోజనం

మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, తాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం దృశ్య డైట్ ఛార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Similar News
News December 29, 2025
FLASH: వికారాబాద్లో జిల్లాలో మరోసారి ఎన్నికలు

వికారాబాద్ జిల్లాలో మరోసారి ఎన్నిక సందడి నెలకొననుంది. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోలింగ్కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం..
☞వికారాబాద్- 34 వార్డుల్లో 63,649 మంది జనాభా
☞కొండంగల్-12, వార్డుల్లో 14,294 మంది
☞పరిగి-18 వార్డుల్లో 18,241 మంది
☞తాండూరు- 36 వార్డుల్లో 71,008 మంది ఉన్నారు. JAN10కల్లా ఓటర్ల జాబితా అధికారులు సిద్ధం చేయనున్నారు.
News December 29, 2025
మేడ్చల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు ఎన్నికలు!

మేడ్చల్ జిల్లాలో ఎన్నికల నగారా మోగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ ఎన్నికలకు EC సమాయత్తం అవుతోంది. GHMC విలీనం అనంతరం మేడ్చల్ జిల్లాలో మిగిలిన 3 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధికారిక జాబితా వెల్లడైంది. అలియాబాద్లో 20 వార్డుల్లో జానాభా 18,876, మూడుచింతలపల్లి 24 వార్డుల్లో 24,214, ఎల్లంపేట 24 వార్డులకు 25,823గా జనాభా సంఖ్య ఉంది.
News December 29, 2025
సిరిసిల్ల జిల్లాలో రెండు మునిసిపాలిటీలు.. వివరాలివే!

జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో 2011 జనాభా గణాంకాల ప్రకారం 1,35,711 జనాభా ఉండగా, ఇందులో 12,891 మంది ఎస్సీలు, 1,557 మంది ఎస్టీలు ఉన్నారు. 2020 మునిసిపల్ ఎన్నికల రికార్డుల ప్రకారం రెండు మున్సిపాలిటీలో కలిపి 69 వార్డులలో 1,10,625 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో యువ ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 10వ తేదీన ప్రకటించనున్నారు


