News February 8, 2025
జైనూర్: విద్యార్థులతో అడిషనల్ కలెక్టర్ భోజనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738932668685_20574997-normal-WIFI.webp)
మండలంలోని పాట్నాపూర్ గ్రామంలో గల ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, తాగునీరు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యం దృశ్య డైట్ ఛార్జీలను పెంచి నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Similar News
News February 8, 2025
ఆలేరు: బస్సులో కండక్టర్ పుస్తెలతాడు చోరీ..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738933906501_51989433-normal-WIFI.webp)
జనగాం నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ వెళ్లే బస్సులో పుస్తెలతాడు అపహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జనగాం డిపోకు చెందిన TS27Z0028 నంబర్గల బస్సులో మహిళా కండక్టర్ ఉమామహేశ్వరికి చెందిన సుమారు మూడు తులాల పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. దీనిపై మహేశ్వరి ఆలేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2025
కొత్త ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738951778154_695-normal-WIFI.webp)
1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలిపాయి. ఈ చట్టంలో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.
News February 8, 2025
YLR: గీత దాటారు.. పార్టీ నుంచి వైదొలగారు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738936192648_50093551-normal-WIFI.webp)
ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ నుంచి తొలగించారు. గత కొన్ని నెలల కింద కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ అధ్యక్షుడు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని తేల్చి చెప్పారు. కాగా సుభాష్ రెడ్డి రెండేళ్లలో పార్టీ నుంచి సస్పెండ్ కావడం ఇది రెండోసారి.