News March 12, 2025

జైపూర్: 40 నెలల్లో పవర్ ప్లాంట్ పూర్తి: సింగరేణి సీఎండీ

image

జైపూర్‌లోని 1200మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలో నూతనంగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి బీహెచ్ఈఎల్ సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 4ఏళ్లలో ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలని పేర్కొన్నారు. కానీ 40 నెలల్లోనే పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.

Similar News

News February 19, 2026

చిత్తూరు: అక్కడ మధ్యాహ్నం వరకే స్కూల్స్..

image

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలల పనివేళల్లో సవరణ చేస్తున్నట్లు డీఈవో రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని ఉర్దూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయన్నారు. ఉపాధ్యాయులు రంజాన్ మాసంలో ప్రతి రోజూ సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని ఆయన వెల్లడించారు.

News February 19, 2026

ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

image

<>HYD<<>>లోని CSIR-IICT 16పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు FEB 24న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PhD, MTech, మెటీరియల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, MSc(కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్&న్యూట్రీషన్), BTech/BE, BSc అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు గరిష్ఠ వయసు 40 ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 35ఏళ్లు. సైట్: www.iict.res.in

News February 19, 2026

BREAKING: రాష్ట్రంలో భూకంపం

image

AP: పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20km దూరంలో, భూమికి 10km లోతులో కేంద్రం ఉన్నట్లు EMSC, NCS ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శి ప్రాంతాల్లోనూ ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.