News October 18, 2025
జోగి రమేశ్, కల్తీ లిక్కర్ నిందితుడు జనార్ధన్ల ఫొటో వైరల్

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇటీవల కల్తీ లిక్కర్ నిందితుడు జనార్ధన్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘జోగి, జనార్దన్ మిత్రబంధం గట్టిదే?’ వంటి ప్రశ్నలు వేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ ఫోటోలు చర్చనీయాంశంగా మారాయి. ఇది YCP, TDP పట్ల వ్యూహాత్మక దిశలో కొత్త ప్రశ్నలకు దారి తీస్తుందని స్థానిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News October 18, 2025
మరో వివాదంలో యూసుఫ్ పఠాన్

Ex క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బెంగాల్లోని అదీనా మసీదుపై ఆయన చేసిన ట్వీట్ తాజాగా దుమారం రేపింది. ఇది అద్భుత కట్టడమని, సుల్తాన్ సికందర్ నిర్మించారని పోస్ట్ చేయడంపై BJP నేతలు మండిపడుతున్నారు. అది మసీదు కాదని, ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల <<17728883>>ప్రభుత్వ స్థలాన్ని<<>> ఆక్రమించారని ఆయనపై GJ హైకోర్టు సీరియస్ అవడం తెలిసిందే.
News October 18, 2025
పేదలకు ఉచిత న్యాయ సలహా: జడ్జి కే. మాధవి

పేదలకు ఉచిత న్యాయ సలహా, సహాయాన్ని అందిస్తామని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కే. మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ తెలిపారు. శనివారం పెంటపాడు, గణపవరం పంచాయతీ కార్యాలయాల వద్ద వారు న్యాయ సహాయ సేవా కేంద్రాలను ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యలకు ఉచితంగా పరిష్కారం అందిస్తామన్నారు. చిన్న సమస్యలను ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.
News October 18, 2025
పల్నాడు పోలీసుల ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం

నరసరావుపేటలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు శ్రమదానంలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లు, పరేడ్ గ్రౌండ్, ప్రధాన కార్యాలయ పరిసరాలను శుభ్రపరిచారు. పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు సిబ్బంది. పరిశుభ్రతతో ఆరోగ్యం కాపాడుకుందాం అని ఎస్పీ బి. కృష్ణారావు పిలుపునిచ్చారు.