News January 26, 2025

జోగులాంబ అమ్మవారి సేవలో సినీ ప్రముఖులు

image

జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఇవాళ ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణ, పోతుగల్ సినిమా హీరో ఉభయ దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థప్రసాదాలు అందించి ఆలయం స్థల పురాణం వివరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. అనంతరం తుంగభద్ర పుష్కర ఘాట్ నదిని వీక్షించారు.

Similar News

News November 6, 2025

మానకొండూర్: జ్యోతి వెలిగించి స్పోర్ట్స్ మీట్ ప్రారంభించిన కలెక్టర్

image

మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి ఈ స్పోర్ట్స్ మీట్‌‌ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ పాఠవాలను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.

News November 6, 2025

రేపు పాఠశాలల్లో సామూహిక వందేమాతరం గీత ఆలాపన: డీఈవో

image

వందేమాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని రకాల పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం వేడుకలు నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించాలని డీఈవో ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచించారు.

News November 6, 2025

GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్‌లైన్

image

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్‌లైన్ నంబర్‌ సంప్రదించాలని సూచించారు.