News March 18, 2025
జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

@గద్వాల: ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు@ జమ్మిచెడు జమ్ములమ్మకు విశేష పూజలు.@ ఉత్తమ ఫలితాలు సాధించాలి:ఎమ్మెల్యే బండ్ల @మల్దకల్: శాశ్వత సర్వేయర్ను నియమించాలి.CPI @మానవపాడు:GOVT స్కూల్ పిల్లలు సత్తా చాటాలి.@ఇటిక్యాల:NREGS పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ @అయిజ: అందరూ రండి..రక్తదానం చేయండి.@వడ్డేపల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురవొద్దు.@గట్టు: ఎండ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Similar News
News December 30, 2025
NRPT: ‘కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు వేయాలి’

మాదకద్రవ్యాల అనర్థాలపై యువతకు, విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన మాదకద్రవ్యాల నిషేధ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగుపై నిఘా ఉంచాలని, కళాశాలల్లో తప్పనిసరిగా యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News December 30, 2025
3.27 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ ధాన్యం కొనుగోలు: కలెక్టర్

రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు చేపడుతోందని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లాలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న 348 కేంద్రాల ద్వారా పారదర్శకంగా సేకరణ జరుగుతోందన్నారు. ఇప్పటివరకు సుమారు 63 వేల మంది రైతులు తమ పంటను విక్రయించారని, వారి ఖాతాల్లోకి రూ.782.59 కోట్ల నగదును జమ చేసినట్లు తెలిపారు.
News December 30, 2025
సిద్దిపేట: ‘రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని కార్మిక కర్షక భవనంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ ప్రణాళిక రూపోందిస్తామన్నా హామీ అమలుకు నోచుకోలేదన్నారు.


