News March 18, 2025
జోగులాంబ గద్వాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

@గద్వాల: ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు@ జమ్మిచెడు జమ్ములమ్మకు విశేష పూజలు.@ ఉత్తమ ఫలితాలు సాధించాలి:ఎమ్మెల్యే బండ్ల @మల్దకల్: శాశ్వత సర్వేయర్ను నియమించాలి.CPI @మానవపాడు:GOVT స్కూల్ పిల్లలు సత్తా చాటాలి.@ఇటిక్యాల:NREGS పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ @అయిజ: అందరూ రండి..రక్తదానం చేయండి.@వడ్డేపల్లి: పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురవొద్దు.@గట్టు: ఎండ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
Similar News
News February 13, 2026
భగ్గుమంటున్న ధరలు

దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతోంది. JANలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. రాష్ట్రాల వారీగా TGలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో AP ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.
News February 13, 2026
ఆ పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలి: చిత్తూరు MP

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ఏపీలో అమలు చేయాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు కోరారు. ప్రస్తుతం చంఢీగఢ్, అస్సాం, పంజాబ్, ఉత్తరఖండ్, హర్యానా, పుదుచ్చేరిలో అమలులో ఉన్న ఈ పథకాన్ని ఏపీలోనూ అమలు చేసి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు.
News February 13, 2026
MBNR: 41 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు!

మహబూబ్ నగర్ జిల్లాలోని 81 డివిజన్ల మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు అధికారులు 41 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇందులో మహబూబ్ నగర్ కార్పొరేషన్ కోసం 30, దేవరకద్రకు 6, భూత్పూర్ మున్సిపాలిటీకి 5 టేబుళ్లను కేటాయించారు. మొత్తం 185 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది.


