News March 17, 2025

జోగులాంబ గద్వాల జిల్లా ముఖ్య వార్తలు

image

జోగులాంబ :@ధరూర్ : LOC అందజేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.
@ఇటిక్యాల :RTC బస్సులను నిలపాలని వినతి.
@ఉండవెల్లి : మారమునగాలలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
@రాజోలి : యాసంగి పంటలకు సాగునీటిని విడుదల చేయాలి.
@అలంపూర్ : మటన్ షాపులకు భారీగా పెరిగిన విక్రయాలు.
@ జిల్లాలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
@అయిజ: స్నేహితుడి వైద్యానికి ఆర్థిక సహాయం అందించారు.
@గద్వాల : ప్రజా సమస్యలను పరిష్కరించండి.సిపిఎం

Similar News

News March 17, 2025

ప్రజావాణి రద్దు: జనగామ కలెక్టర్

image

జనగామ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రకటనలో తెలిపారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్‌లో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి వినతులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దన్నారు.

News March 17, 2025

హరిపురంలో బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య

image

మందస మండలం హరిపురం రైల్వే స్టేషన్ సమీపాన బీహార్‌కు చెందిన బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన సోనూ కుమార్ సాహు (28) ఆదివారం మనస్తాపంతో గురై తన గదిలో గల దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారాన్ని మందస పోలీసులకు అందించారు. మందస ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ వివరాలు సేకరిస్తున్నారు.

News March 17, 2025

పుతిన్, జెలెన్‌స్కీలకు సూచన చేయగలను: మోదీ

image

రష్యా- ఉక్రెయిన్ దేశాలతో తనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయని ప్రధాని మోదీ అన్నారు. “పుతిన్‌తో ఇది యుద్ధానికి సమయం కాదు అని చెప్పగలను. అదేవిధంగా జెలెన్‌స్కీతో ఎన్ని దేశాలు నీతో ఉన్నా యుద్ధం ముగింపుకు పరిష్కారం లభించదని సూచించగలను” అని పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌ ఇంటర్వూలో తెలిపారు. రెండు దేశాలు చర్చలు జరిపి పరిష్కారం వెతకాలని కోరారు. యుద్ధం వల్ల గ్లోబల్ సౌత్ నష్టపోయిందని మోడీ అన్నారు.

error: Content is protected !!