News December 16, 2025

జోజినగర్ స్థలం కబ్జాలో టీడీపీ నేతల పాత్ర: వైఎస్ జగన్

image

విజయవాడ భవానిపురంలోని జోజినగర్ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.150 కోట్ల విలువైన స్థలాన్ని టీడీపీ నేతలతో కలిసి కబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 2016లో రమా సొసైటీ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి, 25 ఏళ్లుగా నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం దారుణమని జగన్ అన్నారు.

Similar News

News December 17, 2025

ఎల్లుండి గవర్నర్‌తో జగన్ భేటీ

image

AP: ఈ నెల 18న 4PMకు జగన్ గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి <<18575709>>సంతకాల<<>> పత్రాలను అందజేస్తారని వైసీపీ తెలిపింది. అంతకుముందు 10AMకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపిస్తారని వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సమావేశం అవుతారని వివరించింది.

News December 17, 2025

SRH మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఫైర్

image

IPL-2026 సీజన్‌కు SRH టీమ్‌లో స్టార్ బౌలర్లు లేరని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్ ఉన్నా వాళ్లు భారీగా రన్స్ సమర్పించుకునే వారేనని గుర్తుచేస్తున్నారు. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, అమిత్ కుమార్‌, శివమ్ మావిలకు అనుభవం లేదని గుర్తుచేస్తున్నారు. స్టార్ బౌలర్లు లేకుండా టీమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారని మండిపడుతున్నారు.

News December 17, 2025

KPHB సాయినగర్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

KPHB PS పరిధిలోనీ సాయినగర్‌లోని ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో 1st ఇయర్ MPC విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు చేరుకుని యాజమాన్యం వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.