News March 19, 2025

జ్యోతి క్షేత్రమును సందర్శించనున్న కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు

image

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి బుధవారం శ్రీ అవధూత కాశినాయన జ్యోతి క్షేత్రమును సందర్శించనున్నారు. జ్యోతి క్షేత్రములో కాశినాయన స్వామిని దర్శించుకొని అనంతరం అటవీశాఖ అధికారులు కూల్చివేసిన వసతి భవనాలను, మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో పునఃనిర్మించిన భవనాలను పరిశీలించనున్నారు.

Similar News

News December 19, 2025

కడప: ట్రాక్టర్ చక్రాల కిందపడి వ్యక్తి మృతి

image

ట్రాక్టర్‌పై నుంచి కింద పడి అదే వాహన చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం వెలవలి సాయిబాబా దేవాలయం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం వేళ అతను కూలి పనులకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.

News December 19, 2025

కడప: ప్రజలకు APS RTC గుడ్ న్యూస్..!

image

YSR కడప జిల్లాలోని ప్రజలకు APS RTC శుభవార్త తెలిపింది. APS RTC కార్గో విభాగం డిసెంబర్ 20 నుంచి 2026 జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 84 ముఖ్య పట్టణాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో, 50 కేజీల వరకు సరుకులను నేరుగా ఇంటి వద్దకే చేరవేసే ఈ సేవ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 19, 2025

కడప: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

మంచిగా ఉండమని చెప్పినందుకు బంధువు నరసింహుడిని చంపిన నిందితుడు నాగరాజుకు శుక్రవారం ప్రొద్దుటూరు కోర్టు యావజ్జీవ శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. నిందితుడు తన బంధువును 2021లో జమ్మలమడుగులోని ఓ తోటలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో జడ్జి సత్యకుమారి శుక్రవారం శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.