News June 25, 2024

టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర

image

ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థగాథలే.. కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా.. పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటించారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News June 29, 2024

అనారోగ్యంతో డిప్యూటీ MRO ఆత్మహత్య

image

అనారోగ్యంతో ఓ డిప్యూటీ MRO ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కోటబొమ్మాలి మండలంలో శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నీలంపేటకు చెందిన ఆర్.శ్రీనివాస్ రావు పౌరసరఫరాల విభాగంలో డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తూ శ్రీకాకుళంలోని ఇందిరా నగర్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 29, 2024

శ్రీకాకుళం: ఇంజినీరింగ్ కోర్సు దరఖాస్తుల పరిశీలన

image

RGUKT లో ఆరేళ్ల సమీకృత B.TECH ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి శ్రీకాకుళం క్యాంపస్‌కు సంబంధించి జులై 26, 27వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుందని డైరెక్టర్ కె.బాలాజీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారని అడ్మిషన్స్ కన్వీనర్ ఎస్.అమరేంద్ర కుమార్ శుక్రవారం వెల్లడించారు. అభ్యర్థులు గమనించాలని సూచించారు.

News June 28, 2024

శ్రీకాకుళం: ITIలో 3,608 సీట్లకు 826 ప్రవేశాలు

image

శ్రీకాకుళం జిల్లాలోని ఐటీఐలో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,470 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,608 సీట్లు గాను కేవలం 826 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 23 ఐటిఐ కళాశాలల్లో 2,782 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనితో విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు.