News June 27, 2024

టాస్క్ ఫోర్స్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఎస్పీ

image

తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ, టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జి హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఆయనకు టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ శ్రీనివాస్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జ్ కార్యాలయంలో ఆయన అధికారులతో మాట్లాడారు. అడవుల్లో చేపడుతున్న కూంబింగ్, సమాచార వ్యవస్థ గురించి ఎస్పీ శ్రీనివాస్ ఆయనకు వివరించారు. కూంబింగ్ ఆపరేషన్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Similar News

News May 8, 2025

మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యే థామస్ భేటీ

image

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.

News May 7, 2025

28న చిత్తూరులో జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

News May 7, 2025

సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు 

image

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.