News August 24, 2025
టీచర్లుగా ఎంపికైన భార్యాభర్తలు

మహానంది మండలం గోపవరానికి చెందిన పగడాల శ్రీనివాసులు, లక్ష్మీకళ దంపతులు ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. శ్రీనివాసులు అల్లీనగరంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తునే గాజులపల్లెలో ఇన్ఛార్జ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువతో డీఎస్సీ పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో దంపతులిద్దరూ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ డైరెక్టర్లు)గా ఉద్యోగాలు సాధించారు.
Similar News
News August 24, 2025
MDK: మద్యం టెండర్లు.. వస్తే ఆ కిక్కే వేరు!

ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారుల్లో కదలిక మొదలైంది. ప్రస్తుతం మద్యం షాపులు నడుపుతున్న యజమానులు, గతంలో టెండర్ వేసి షాపులు దొరకని వారు ఇప్పటి నుంచే గ్రూపులు, సిండికేట్లుగా ఏర్పడి టెండర్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. SDPT-93, MDK-49, SRD-101 కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 243 వైన్ షాపులు ఉన్నాయి. మద్యం పాలసీపై మీ కామెంట్.
News August 24, 2025
ఖమ్మం: ‘జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం’

ఆగస్టు 26 లోపు మైనారిటీ అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలోని TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి అరుణ కుమారి తెలిపారు. ఎంపీసీ/బైపీసీ గ్రూపులలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్థులు TMR జూనియర్ కళాశాలలో ప్రవేశానికి అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు 91543 65017, 78931 16918 నెంబర్లకు సంప్రదించాలన్నారు.
News August 24, 2025
HYD: సంతాన సమస్యలు ఉన్నాయా? ఇక్కడకు వెళ్లండి

HYDలో సృష్టి ఘటనతో సంతాన సమస్యలు ఉన్న వారు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ఈ సమస్యలు ఉన్న వారికి వరప్రదాయానిగా ప్రభుత్వ ఆస్పత్రులు నిలుస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్ సెంటర్, ప్లేట్ల బురుజు ఆస్పత్రిలో సంతాన సాఫల్య కేంద్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే కొండాపూర్ ఆస్పత్రిలోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
# SHARE IT