News July 10, 2025
టీటీడీ తొలి ఈవో ఎవరంటే?

చెలికాని అన్నారావు 1933లో తిరుమల ఆలయ పేష్కారుగా చేరారు. 1949లో కమిషనర్గా, 1951 నుంచి 1964 వరకు TTD తొలి ఈవోగా పని చేశారు. 1974 నుంచి 1979 వరకు తొలి TTD ఛైర్మన్గా శ్రీవారి సేవలో తరించారు. రేడియోల్లో స్వామివారి సుప్రభాత ప్రసారం, ఘాట్ రోడ్డులో దేవస్థానం బస్సు, TTD విద్యాసంస్థలు, లెప్రర్సీ ఆసుపత్రి, ఎంప్లాయిస్ బ్యాంకు ఏర్పాటు చేశారు. వీటికి గుర్తుగా 2007లో తిరుపతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Similar News
News July 10, 2025
పెద్దపల్లి: ‘సమిష్టి కృషితో నిర్దేశించిన లక్ష్యాలను సాధించుకోవాలి’

సమిష్టి కృషితో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించుకోవాలని డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం అర్జీ-3, ఏపీఏ ఏరియాల్లో ఆయన పర్యటించారు. జీఎంలు ఎన్.సుధాకరరావు, కె.నాగేశ్వరరావుతోపాటు వివిధ గనుల, విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, ఉద్యోగుల సంక్షేమం, రిటైర్మెంట్ బెనిఫిట్లు, కారుణ్య నియామకాలు, ఉద్యోగుల పదోన్నతుల వివరాలను వెల్లడించారు.
News July 10, 2025
చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్: హీరా లాల్

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.
News July 10, 2025
NGKL: ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్గా ఉషారాణి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉషారాణి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఆస్పత్రి సిబ్బందితో కలిసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. అంతకుముందు ఆస్పత్రి సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.