News March 31, 2024
టీడీపీకి కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా రాజీనామా

కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలిపారు. టీడీపీలో పార్టీ కోసం కష్టపడిన నేతలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 30, 2025
రేషన్ షాపులకు అక్టోబర్ నెల రేషన్ సరుకుల రాక

అనంతపురం జిల్లాలోని 6,62,014 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు 1645 చౌక ధరల దుకాణాలకు కేటాయించామని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల వద్దనే బియ్యం కార్డుదారులకు సరఫరా చేస్తామని వెల్లడించారు.
News September 30, 2025
కలెక్టర్ ఆనంద్ మార్క్.. అధికారుల్లో దడ!

అనంతపురం (D) కలెక్టర్ ఆనంద్ తనదైన మార్క్ చూపిస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులకు వణుకు పుట్టిస్తున్నారు. ‘మార్పు రావాల్సిందే. లేకుంటే మార్చేస్తా’ అంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో బాలుడు మృతిచెందడంతో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులను వెంటనే సస్పెండ్ చేశారు. అలాగే తన క్యాంపు కార్యాలయంలో వ్యక్తిగత సిబ్బందిని సైతం 9 నుంచి ముగ్గురికి తగ్గించడం విశేషం.
News September 29, 2025
అర్జీలు స్వీకరించిన అనంతపురం కలెక్టర్

అనంతపురంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్కు అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల పాల్గొన్నారు.