News October 24, 2025
టీడీపీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జిగా నులుకుర్తి ఖరారు?

కాకినాడ రూరల్ నియోజకవర్గానికి దాదాపు ఏడేళ్లుగా టీడీపీకి ఇన్ఛార్జి లేరు. ఇన్ఛార్జి పదవి కోసం పలువురు పోటీపడుతున్న తరుణంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేసినట్లు చర్చ నడుస్తోంది. ఈ పదవి కోసం పోటీపడిన కటకంశెట్టి బాబిని కుడా (KUDA) ఛైర్మన్గా నియమిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
Similar News
News October 24, 2025
గాజా డీల్ను బలహీనపరిస్తే నెతన్యాహుపై తీవ్ర చర్యలు!

వెస్ట్ బ్యాంక్ <<18087139>>స్వాధీనానికి <<>>ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. గాజా డీల్ను ఆ దేశ PM నెతన్యాహు బలహీనపరిస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకుంటారని ఓ US అధికారి హెచ్చరించారు. ‘ట్రంప్తో క్లిష్టమైన దౌత్య పరిస్థితులను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన గాజా డీల్ను నిర్వీర్యం చేస్తే ట్రంప్ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది’ అని చెప్పారు.
News October 24, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

పవర్గ్రిడ్ కార్పొరేషన్లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 24, 2025
గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనకు ఆమోదం

తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర చర్చకు దారి తీసిన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. కొందరు సభ్యులు విలీన వినతిని, వ్యతిరేకత ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మరికొందరు మాత్రం వెంటనే ఆమోదించి విలీనాన్ని చూడాలని కోరారు. దీనిపై మేయర్ ప్రతిపాదన ఆమోదం కలెక్టర్కు పంపుతామన్నారు.


