News July 3, 2024
టీయూలో పీజీ చేస్తూ.. ఎస్బీఐలో ఉద్యోగం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720007144508-normal-WIFI.webp)
టీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ధర్మపురి సాయికుమార్ ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించడం అభినందనీయమని ఎకనామిక్స్ విభాగాధిపతి డా.పున్నయ్య పేర్కొన్నారు. అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ను శాలువాతో సత్కరించి అభినందించారు. డా.సంపత్, డా.నాగరాజు, డా.స్వప్న, డా.శ్రీనివాస్, డా.దత్తహరి విద్యార్థులు పాల్గొన్నారు.
Similar News
News February 8, 2025
నిజామాబాద్: రేటు రాక పసుపు రైతుల్లో ఆందోళన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738993302999_50934603-normal-WIFI.webp)
నిజామాబాద్ మార్కెట్లో కొన్ని రోజులుగా పసుపు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ధర మాత్రం గతేడాది కంటే తక్కువ ఉందని రైతులు చెబుతున్నారు. గత సీజన్లో మొదట 13 వేలకు క్వింటాలు ఉండగా ప్రస్తుత సీజన్లో అది 11 వేలకు పడిపోయింది. తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గడం మరో వైపు ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
News February 8, 2025
కామారెడ్డి: ఆ స్తంభానికి కరెంట్ కనెక్షన్ లేదు: డిపో మేనేజర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739001775435_718-normal-WIFI.webp)
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి బస్టాండ్లో శనివారం కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు <<15397229>>విద్యుత్ స్తంభాన్ని<<>> ఢీకొట్టిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిరా స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. మాచారెడ్డి బస్టాండ్లో గతంలో విరిగి, ఎలాంటి కరెంట్ కనెక్షన్ లేని స్తంభాన్ని తాకిందని, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారన్నారు.
News February 8, 2025
NZB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738991522097_18060220-normal-WIFI.webp)
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.