News February 11, 2026

టెక్కలి: జాబ్ మేళాలో 64 మందికి ఉద్యోగాలు

image

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రిన్సిపల్ డాక్టర్ టి. గోవిందమ్మ అధ్యక్షతన టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 147 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 64 మంది అర్హతల ఆధారంగా పలు కంపెనీలకు ఎంపికయ్యారు. ప్లేస్మెంట్ అధికారి M.వంశీ క్రిష్ణ, IQAC కోఆర్డినేటర్ ల్యూక్ పాల్, కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.

Similar News

News February 16, 2026

ఇండియా పోస్ట్ లో ఉద్యోగాలకు నేడే లాస్ట్..!

image

శ్రీకాకుళం జిల్లాలో ఇండియా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల దరఖాస్తుకు నేటితో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా సుమారు 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18-40 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఉండదు. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380,
ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000-24,470 వేతనం ఉంటుంది.

News February 16, 2026

టెక్కలి: మూడేళ్ళ క్రితం తండ్రి మృతి… ఇప్పుడు కుమార్తె ఆత్మహత్య

image

టెక్కలి మండలం పాలసింగి గ్రామానికి చెందిన ఏ.అరుణ(19) అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఆదివారం <<19152656>>కాకినాడ JNTU హాస్టల్‌లో ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి తండ్రి రాము మూడేళ్ల క్రితం తిరుపతిలో భవన నిర్మాణ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. తాజాగా కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలికి తల్లి సంధ్య(వ్యవసాయ కూలీ), సోదరుడు ఉన్నారు.

News February 15, 2026

జేఎన్టీయూ హాస్టల్‌లో శ్రీకాకుళం విద్యార్థిని సూసైడ్

image

కాకినాడ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ.అరుణ(19) ఇవాళ సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు సర్పవరం పోలీసులు తెలిపారు. జేఎన్టీయులోని నాగవల్లి లేడీస్ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలిది శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామం అని చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసుపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు.