News March 18, 2025

టెక్ సపోర్ట్ స్కామ్ పట్ల జాగ్రత్త: అన్నమయ్య SP

image

టెక్ సపోర్ట్ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఒక ప్రకటన విధులు చేశారు. టెక్ సపోర్ట్ స్కామ్ అనేది ఒక రకమైన మోసం, ఇందులో మోసగాళ్లు ప్రముఖ టెక్ కంపెనీల (ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటివి) సాంకేతిక మద్దతు సిబ్బందిగా నటిస్తారన్నారు. వారు మీ కంప్యూటర్ లేదా ఇతర పరికరాలలో సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తామని మోసం చేస్తారన్నారు.

Similar News

News January 9, 2026

‘రథసప్తమి’కి అంకురార్పణ

image

సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలను ఈ ఏడాది ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా వైభవంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శుక్రవారం ఉదయం అరసవల్లి దేవస్థాన ప్రాంగణంలో ‘కర్టెన్ రైజర్’ కార్యక్రమంతో రథసప్తమి ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ చేశారు. జనవరి 19 నుంచి 25 వరకు ఏడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

News January 9, 2026

ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం..

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విద్యార్థులు నేరుగా మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పరీక్ష పే చర్చ 2026 కార్యక్రమం ద్వారా ఈ అవకాశం పొందవచ్చు. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఎలా సిద్ధం కావాలనే విషయాలపై ఈ చర్చ నడుస్తుంది. ప్రధాని రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

News January 9, 2026

9వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్!

image

తెలంగాణలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹290Cr వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ఇంధన&పునరుత్పాదక ఇంధన విభాగాలు వచ్చే నెల నాటికి టెండర్లను ఖరారు చేయనున్నాయి. స్కూళ్లలో సౌర విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు.