News November 1, 2025

టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

image

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్‌లో పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.

Similar News

News November 1, 2025

ఇండస్ నీరు ఏమాత్రం ఆగినా పాక్‌లో వినాశనమే: IEP

image

పాకిస్థాన్‌లో 80% వ్యవసాయం ‘ఇండస్’ నీటిపైనే ఆధారపడింది. ఈ బేసిన్ అత్యధిక భాగం ఉన్న ఇండియా కనుక నీటి ప్రవాహాన్ని ఏమాత్రం ఆపినా పాక్ తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడుతుందని సిడ్నీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ పేర్కొంది. పాక్‌లోని సింధునది ఆనకట్టల్లో 30రోజులకు మించి నీటి నిల్వలకు అవకాశం లేదని పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలంపాటు సాగు దెబ్బతిని ఆ దేశ వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించింది.

News November 1, 2025

పోక్సో కేసులో దోషికి శిక్ష రద్దు

image

పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తిపై శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కృపాకరన్(TN) అనే వ్యక్తి 2017లో బాలికపై లైంగికదాడి చేశాడు. అతడికి కింది కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను మద్రాస్ HC సమర్థించింది. దీంతో సుప్రీంను ఆశ్రయించిన అతడు తాము పెళ్లి చేసుకుని బిడ్డతో సంతోషంగా ఉన్నామని తెలిపాడు. అది ప్రేమతో జరిగిన నేరమే తప్ప కామంతో కాదని వ్యాఖ్యానిస్తూ సుప్రీం అతడి శిక్షను రద్దు చేసింది.

News November 1, 2025

తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫల్యమే కారణం: దేవాదాయ శాఖ

image

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో <<18167780>>తొక్కిసలాట <<>>ఘటనపై దేవాదాయ శాఖ స్పందించింది. అది పూర్తిగా ప్రైవేటు గుడి అని, ప్రభుత్వ అధీనంలో లేదని తెలిపింది. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పింది. ప్రభుత్వానికి వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా ఈ ఆలయాన్ని ఇటీవలే ప్రారంభించారని అధికారులు చెబుతున్నారు.