News March 14, 2025

 టెన్త్ ఎగ్జామ్స్‌..ఎలా చదువుతున్నారు: కలెక్టర్

image

పదవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయని, కష్టపడి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి విద్యార్థులు ఎలా చదువుతున్నారు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదివించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాధికారి దశరథ్ పాల్గొన్నారు.

Similar News

News July 9, 2025

ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్‌ వెళితే గేట్లకు సీల్

image

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.

News July 9, 2025

మాతృభూమికి సేవ చేయడం అభినందనీయం: కలెక్టర్

image

జన్మభూమికి సేవ చేయాలనే సంకల్పంతో పలు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. మూడేళ్లుగా వేలాది మందికి శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారన్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారని పేర్కొన్నారు. యూఎస్ఏకు చెందిన చిక్కాల విద్యాసాగర్ ముందున్నారని కలెక్టర్ ప్రశంసించారు.

News July 9, 2025

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు మహర్దశ

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రూ.160 కోట్లతో రెండు స్ట్రోం వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండోది రసూల్‌పూర బస్తీల మీదుగా మంజూరైంది. SNDP మాదిరిగా వీటిని నిర్మించనున్నారు. దీనితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.