News December 9, 2025

టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

image

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఇది ఉపయోగపడనుంది.

Similar News

News March 9, 2026

భవిష్యత్తులోనూ తప్పులు జరగకుండా పాస్ పుస్తకాలు: సీఎం

image

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని CM CBN చెప్పారు. YCP హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది QR కోడ్‌తో పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల(D) కొత్తబురుజులో రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని తెలిపారు.

News March 9, 2026

వడదెబ్బ మృతులకు ₹4లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే?

image

TG: వేసవిలో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు GOVT ₹4 లక్షల పరిహారం అందించనుంది. గతంలో ఇది ₹50,000 మాత్రమే. SDMA గత ఏడాది ఈ మొత్తాన్ని పెంచింది. వడదెబ్బ మరణాలను మండల స్థాయిలో రెవెన్యూ, ఆరోగ్య, పోలీసు శాఖల అధికారుల కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది. కనుక ఎవరైనా వ్యక్తులు వడదెబ్బతో చనిపోయినట్లయితే తప్పనిసరిగా పోస్ట్‌మార్టం జరిపించాలి. డెత్ సర్టిఫికెట్, పంచనామా రిపోర్టు ఆధారంగా దరఖాస్తు చేయాలి.

News March 9, 2026

11 రోజుల్లో నాన్‌స్టాప్‌గా 13వేల కిలోమీటర్ల జర్నీ!

image

B6 అనే 4 నెలల బార్ టెయిల్డ్ గాడ్‌విట్ పక్షి‌కి 11 రోజుల్లోనే నిర్విరామంగా 13,560km ప్రయాణించిన ప్రపంచ రికార్డ్ ఉంది. జర్నీకి ముందు అలాస్కాలో ఎక్కువ ఆహారం తిని కొవ్వును పెంచుకుంది. ప్రయాణంలో అవయవాల సైజ్‌ను తగ్గించుకొని కొవ్వును కరిగించుకుంటూ శక్తిని తెచ్చుకునేది. ఎగురుతూనే మెదడులో సగభాగాన్ని అలర్ట్‌గా ఉంచి నిద్రపోయేది. భూఅయస్కాంత శక్తి ఆధారంగా దిక్కులు గుర్తిస్తూ మెరుగైన ఆహారం కోసం AUS చేరుకుంది.