News December 23, 2025
టెన్షన్ వద్దు.. ప్రతి గంటకు పరీక్షలు చేస్తాం: HMWSSB

ఇటీవల గండిపేట చెరువులో సెప్టిక్ ట్యాంక్తో వ్యర్థాలను వదులుతుండటంతో నగరం ఉలిక్కిపడింది. కాగా జలాశయం నుంచి నీటిని ఆసిఫ్నగర్, మీర్ఆలం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ధి చేసిన అనంతరం HYDకు సరఫరా చేస్తామని HMWSSB తెలిపింది. నీటి నాణ్యతపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ప్రతి గంటకు నీటి ప్రమాణాలను పరీక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. శుద్ధి ప్రక్రియలో అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామన్నారు.
Similar News
News December 23, 2025
పరుగు పందెంలో సత్తా చాటిన జిల్లా అథ్లెట్లు

కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు సాగాయి. ఈ పోటీలను జిల్లా అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. వీరు వచ్చే ఏడాది JUN 2న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తారు.
News December 23, 2025
కార్మికుల క్రమశిక్షణే సింగరేణి బలం: డైరెక్టర్ సూర్యనారాయణ

కార్మికుల శ్రమ, క్రమశిక్షణ, పరస్పర నమ్మకమే సింగరేణికి అసలైన బలమని ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ప్రధాన కార్యాలయంలో జరిగిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి జెండాను ఆవిష్కరించి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.
News December 23, 2025
నల్గొండ: ‘అధికారం కోల్పోయాక KTRకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరం’

అధికారం కోల్పోయాక కేటీఆర్, హరీశ్రావుకు కృష్ణ జలాలు గుర్తుకు రావడం విడ్డూరమని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్ నేత మండిపడ్డారు. వారి తీరు సురభి నాటకాలను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి,ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని,రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు.


