News March 20, 2025
టేకులపల్లి: బాలికపై అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం సంపత్ నగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల హాస్టల్ డిప్యూటీ వార్డెన్ ప్రతాప్ సింగ్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు, యువకులు దేహశుద్ధి చేశారు. అనంతరం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News March 21, 2025
రాబోయే 4 సం.రాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి

ఖమ్మం: రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 4 లక్షల 50 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టి, రాబోయే 4 సం.లలో 20 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లను కట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మంత్రి పెనుబల్లి, కల్లూరు మండలాల్లో పర్యటించి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు, CC రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు.
News March 20, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు…

∆} నేలకొండపల్లి:రైతు పొరపాటు.. ఐదెకరాలు ఎండిపోయింది!
∆}ఖమ్మం: అన్ని రంగాలకు కాంగ్రెస్ వెన్నుపోటు: ఎమ్మెల్సీ
∆}జూలూరుపాడు: నీటి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే
∆}చింతకాని: గుండెపోటుతో బీఆర్ఎస్ నేత మృతి
∆} ఖమ్మం:KCR నియంతలా వ్యవహరించారు: గుమ్మడి నరసయ్య
∆} ఖమ్మం:ధాన్యం కొనుగోలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్
∆} పెనుబల్లిలో మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం
∆}ట్రాక్టర్ బావిలో పడి ఒకరు దుర్మరణం
News March 20, 2025
వ్యాపారవేత్త ఆలోచనతో మహిళలు ముందుకు సాగాలి: కలెక్టర్

ఖమ్మం: సమాజంలో సమానత్వం రావాలంటే మహిళలు అన్ని రంగాలలో నైపుణ్య వ్యాపారం చేస్తూ ఆర్థిక బలం సాధిస్తే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో ఉన్న మండల మహిళా సమాఖ్య భవనంలో ఉషోదయ, ఆదర్శ మహిళా సమాఖ్యలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వ్యాపారవేత్త ఆలోచనా ధోరణితో మహిళలు ముందుకు సాగాలని పేర్కొన్నారు.