News March 21, 2024
టేక్మాల్: మహిళా హత్య !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711033859886-normal-WIFI.webp)
టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామంలో దుబ్బగళ్ళ సంగమ్మ(44) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొద్ది నెల క్రితం భర్త మృతిచెందగా.. కొడుకు హైదరాబాదులో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి ఇంట్లో పడుకున్న సంగమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. మహిళ శరీరంపై గాయాలు ఉండడంతో అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
Similar News
News July 3, 2024
కంగ్టి: బ్రెయిన్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719974598715-normal-WIFI.webp)
బ్రెయిన్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన కోటగిరి రాజు(35) కొద్ది రోజులుగా తలలో నొప్పితో బాధపడుతూ సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఆపరేషన్ చేశారని, పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
News July 3, 2024
MDK: నేటితో ముగియనున్న పదవీ కాలం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719968734323-normal-WIFI.webp)
ఉమ్మడి మెదక్ జిల్లాలో MPTC సభ్యుల పదవీ కాలం నేటితో ముగియనుంది. 2019 మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. జులై 3న మండల పరిషత్, 4న జిల్లా పరిషత్కు పాలకవర్గాలు కొలువుదీరాయి. 5ఏళ్ల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించనుంది. మెదక్ జిల్లాలో 189 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
News July 3, 2024
సిద్దిపేట: జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719923918086-normal-WIFI.webp)
అటవీ హద్దులను నిర్ధారించుటకు, ఆక్రమణలను తొలగించుటకు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 23,738 హెక్టార్ల అటవీ విస్తీర్ణం 77 ప్రాంతాలలో ఉందని అన్నారు.