News December 18, 2025
టైగర్ జోన్లో ఆవాసాల కొరత.. జనావాసాల్లోకి పులులు

టైగర్ జోన్ పరిధిని దాటి పులులు పెద్దపల్లి జిల్లాలో గ్రామాల శివార్లలోకి రావడం స్థానిక ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. చెట్ల నరికివేత, గనులు, రోడ్ల నిర్మాణంతో పులుల సహజ ఆవాసాలు తగ్గిపోవడం, అడవుల్లో ఆహారం, నీటి కొరత పెరగడం జనావాసాల్లో పులుల సంచారానికి ప్రధాన కారణాలుగా అధికారులు భావిస్తున్నారు. అక్రమ వేట, స్మగ్లింగ్ ముప్పూ పెరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది.
Similar News
News December 23, 2025
KNR: షోకాజ్ నోటీసులపై అదనపు కలెక్టర్కు ‘టీటీయూ’ వినతి

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) నాయకులు సోమవారం అదనపు కలెక్టర్, డీఈవో డాక్టర్ అశ్వినీ తనజీ వాంక్డేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అనారోగ్యం లేదా ఇతర సహేతుకమైన (జెన్యూన్) కారణాలతో విధులకు రాలేని వారికి తప్పనిసరిగా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.
News December 23, 2025
జమ్మికుంట: క్వింటా పత్తి ధర రూ.7,400

మూడు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ ఈరోజు ప్రారంభమైంది. కాగా, పత్తి ధర స్వల్పంగా తగ్గింది. మార్కెట్కు 43 వాహనాల్లో 278 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, గరిష్ఠంగా క్వింటాకు రూ.7,400, కనిష్ఠంగా రూ.7,000 ధర పలికింది. గత వారం కంటే ధర రూ.50 తగినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.
News December 23, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

చింతపల్లి: ర్యాలీపై దాడి.. పలువురికి గాయాలు
నల్గొండ: ప్రజావాణికి 53 దరఖాస్తులు
మునుగోడులో జీవో ప్రతులు దహనం
నల్గొండలో భారీ నిరసన
మిర్యాలగూడ: రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
కొండమల్లేపల్లి: సర్పంచ్ ఇంటిపై దాడి
చండూరు: కుమారుడి ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి
నల్గొండ: మరో పథకానికి మంగళం


