News January 2, 2026
టోల్ ప్లాజాల వద్ద ‘ఫ్రీ’ రూట్ కావాలి.. ఎంపీ సానా సతీష్ ట్వీట్

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జాతీయ రహదారిపై 4రోజుల పాటు టోల్ ఫీజు వసూలు నిలిపివేయాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎక్స్(ట్విట్టర్) వేదికగా విజ్ఞప్తి చేశారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా ఉండేందుకు ‘ఫ్రీ’ విధానం అమలు చేయాలని సూచించారు.
Similar News
News February 7, 2026
ఉప్పల్లో రేపు మెగా సెమినార్

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్లోని SriRasthu Conventionలో రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు
News February 7, 2026
పుత్తూరులో ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి సూసైడ్

పుత్తూరు పట్టణంలో శనివారం హృదయ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కృష్ణానగర్ నందు నివాసం ఉంటున్న తల్లి, ఇద్దరు బిడ్డలు ఉరివేసుకొని మృతి చెందారు. పైడిపల్లికి చెందిన శివ, నేశనురూకు పద్మ (భార్య) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకొన్నారు. వీరికి లాస్య (7), తేజశ్రీ(5) ఇద్దరు ఆడపిల్లలు. శనివారం భర్త లేని సమయంలో పద్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉరివేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 7, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ప్రతీ శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని తెలిపారు.


