News July 8, 2025
ట్రాక్టర్లు, కారు ఢీ.. పది మందికి గాయాలు

గరిడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీతావారిగూడెం వద్ద రెండు ట్రాక్టర్లు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 8, 2025
MHBD: అమ్మాయిలూ.. ఆకతాయిలు ఏడిపిస్తున్నారా?

జామండ్లపల్లి జడ్పీహెచ్ఎస్లో షీ టీం SI సునంద ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంట, బయట ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను, యువతులను భయాందోళనకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. 8712656935కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. MHBD ఎస్పీ రామ్నాధ్ కేకన్ ఆదేశాల మేరకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.
News July 8, 2025
కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దుతాం: సీతక్క

వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న ఈ గుట్టలు ఎన్నో జలపాతాలకు, అటవీ సంపదకు, వన్యప్రాణులకు నిలయంగా ఉన్నాయని అన్నారు. ఈ ప్రాంతం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందితే వెంకటాపురం, వాజేడు ప్రాంతాలు పర్యాటక హబ్గా మారుతాయన్నారు.
News July 8, 2025
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.