News August 2, 2024

ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎండీ

image

TGNPDCL హనుమకొండ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఈలు, డీఈలు, నోడల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అంతరాయాలు, బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News February 2, 2026

వరంగల్: ఎంపిక ప్రక్రియపై దిశానిర్దేశం

image

మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారి డా.సత్య శారదతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News February 2, 2026

బలమైన ప్రజాపక్షపాలన అందించేందుకు సిద్ధం: బీజేపీ

image

BJP ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగింది. గంట రవికుమార్ మాట్లాడుతూ.. అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే బీజేపీ లక్ష్యమన్నారు. మున్సిపాలిటీల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థలలో కూడా బలమైన ప్రజాపక్ష పాలన అందించేందుకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.

News February 2, 2026

వారసత్వ కట్టడాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి: ఎంపీ డా.కావ్య

image

వరంగల్లోని కాకతీయుల కాలంనాటి చారిత్రక కట్టడాల సంరక్షణ, అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలు చేపట్టాలని ఎంపీ డా. కడియం కావ్య డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభలో సంస్కృతి శాఖ మంత్రిని వరంగల్ జిల్లాలోని చారిత్రక కట్టడాలను నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ కింద చేపట్టిన అభివృద్ధిపై ఎంపీ వివరణ కోరారు. అందుకు ఆ శాఖ మంత్రి సమాధానం ఇచ్చారని ఎంపీ తెలిపారు.