News December 30, 2025
ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కలెక్టర్ కీలక ఆదేశం

జిల్లాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారుల విస్తరణ వేగవంతం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం పాశర్లపూడి జంక్షన్ వద్ద 216 బైపాస్ రోడ్డు పనులను ఆర్డీఓ మాధవితో కలిసి ఆయన పరిశీలించారు. రవాణా సౌకర్యాల మెరుగుదల, ప్రజల భద్రతే లక్ష్యంగా పనులు జరగాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Similar News
News January 1, 2026
MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో ఉద్యోగాలు

MSME టెక్నాలజీ సెంటర్, విశాఖపట్నంలో 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 8, 9 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి BE/B.Tech, డిప్లొమా, డిగ్రీ, ITI ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఫ్యాకల్టీ, పర్చేజ్ ఇంఛార్జ్, హాస్టల్ వార్డెన్ పోస్టుకు గరిష్ఠ వయసు 35ఏళ్లు కాగా.. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ పోస్టులకు గరిష్ఠ వయసు 30ఏళ్లు. వెబ్సైట్: www.msmetcvizag.org
News January 1, 2026
తిరుమలలో నేటి రాత్రి నుంచే FREE దర్శనం?

లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. సర్వ దర్శనం(టోకెన్లు లేకుండా ఫ్రీ ఎంట్రీ) నేటి రాత్రి నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TTD సర్వదర్శనం క్యూ లైన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆక్టోపస్ సర్కిల్ నుంచి లైన్ తీసుకోనున్నారు. రద్దీని బట్టి సాయంత్రం నుంచే టోకెన్లు లేని భక్తులను క్యూలోకి అనుమతించే అవకాశం ఉంది. CRO దగ్గర రూములు తీసుకోవచ్చు.
News January 1, 2026
తోటమూల: మైక్ వివాదం.. హిందూ సంఘాల రాస్తారోకో

గంపలగూడెం మండలం తోటమూల చర్చి వద్ద మైక్ సౌండ్ తగ్గించమన్నందుకు హరికృష్ణపై జరిగిన దాడిని నిరసిస్తూ వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. తిరువూరు-మధిర ప్రధాన రహదారిపై బైఠాయించిన నిరసనకారులు.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల నేతలు కోరారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.


