News July 11, 2024
ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలు ఇవే.!

రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థులకు నిర్వహించనున్న కౌన్సెలింగ్ తేదీలను ఆర్జీయూకేటీ ఛాన్స్లర్ ఆచార్య కేసీరెడ్డి ప్రకటించారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 22, 23 తేదీల్లో, ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 24, 25 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వారికి ఈనెల 26, 27 తేదీల్లో శ్రీకాకుళంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Similar News
News March 1, 2026
అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.
News February 28, 2026
కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.
News February 28, 2026
కృష్ణా: జిల్లాలో 124 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సరం వృక్ష శాస్త్రము, హిస్టరీ పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, 7,374 మంది విద్యార్థులకు 7,293 మంది హాజరయ్యారని ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సరళాదేవి తెలిపారు. 124 మంది గైర్హాజరయ్యారని, పరీక్ష సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.


