News October 2, 2024

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు శుభవార్త: మంత్రి పొంగులేటి

image

దసరా పండుగ సమీపిస్తోన్న వేళ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పండుగలోపే అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు అందిస్తామని అన్నారు. సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News February 12, 2026

5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.

News February 12, 2026

ఖమ్మం: కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 అమలు

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5 మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. BNS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ర్యాలీలు, సభలు, ఐదుగురికిపైగా గుమికూడటం నిషేధమన్నారు. విజయోత్సవాలు, డీజేలు, టపాసులపై నిషేధం విధించారు. అదేరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు.

News February 12, 2026

ఓటుతో సామాజిక మార్పు.. ట్రాన్స్‌జెండర్ల పౌర చైతన్యం

image

ఖమ్మం జిల్లాలోని 5మున్సిపాలిటీల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు ఉత్సాహంగా పాల్గొని పౌర బాధ్యత చాటారు. జిల్లాలో మొత్తం 24 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉండగా, వారిలో 17 మంది (దాదాపు 71%) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 11 మంది, మధిరలో ముగ్గురు, ఎదులాపురంలో ఇద్దరు, వైరాలో ఒకరు చొప్పున ఓటు వేశారు. సామాజిక గుర్తింపు, మార్పు కోసమే తాము ఓటు వేసినట్లు వారు పేర్కొన్నారు.