News March 28, 2025
డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగ డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఉగాది డైరీ పంచాంగాన్ని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకు, పాత్రికేయులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు సంజయ్, ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి నరేందర్, సీనియర్ ఉపాధ్యక్షులు సంజయ్ పాల్గొన్నారు.
Similar News
News March 31, 2025
ఆ 400 ఎకరాలు మాదే: టీజీ ప్రభుత్వం

TG: భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ HCU విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఆ 400 ఎకరాల భూమి తమదేనని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇందులో HCUకు సంబంధించిన భూమి లేదని స్పష్టం చేసింది. ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకున్నట్లు పేర్కొంది. భూమికి సంబంధించి ఎలాంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని తెలిపింది. వేలం, అభివృద్ధి కోసం రాళ్ల తొలగింపు ఉండదని చెప్పింది.
News March 31, 2025
KMR: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్పీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రంజాన్ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.ఎస్పి చైతన్య రెడ్డి. జిల్లా అధికారులు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
News March 31, 2025
విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.