News September 11, 2025

డయేరియా వల్ల మరణాలు సంభవించలేదు: కలెక్టర్

image

విజయవాడలో డయేరియా వ్యాధి కారణంగా ఎవరూ మరణించలేదని కలెక్టర్ లక్ష్మీశా స్పష్టం చేశారు. సాధారణ మరణాలను కూడా డయేరియా మరణాలుగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. డయేరియాపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు ఇప్పటికే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నారు.

Similar News

News September 11, 2025

NCLTలో 32 పోస్టులు

image

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(<>NCLT<<>>) స్టెనోగ్రాఫర్ 18, ప్రైవేట్ సెక్యూరిటీస్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్యూరిటీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/

News September 11, 2025

పెట్టుపోతలకు చెక్ పెడదాం

image

మనదేశంలో చాలా పోరాటాల తర్వాత 1961లో వరకట్ననిషేధ చట్టం వచ్చింది. ఇందులో సెక్షన్ 2 ప్రకారం పెళ్లిలో విలువైన వస్తువులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకుంటే అది భార్య, వారసుల కోసమే వాడాలి. సెక్షన్ 3 ప్రకారం కట్నం తీసుకున్నట్లు రుజువైతే ఫైన్, జైలుశిక్ష పడుతుంది. సెక్షన్ 4 ప్రకారం కట్నం డిమాండ్ చేయడం నేరం. సెక్షన్ 6 ప్రకారం పెళ్లిలో తీసుకున్న ఆస్తి, డబ్బు 3నెలల్లో అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలి.

News September 11, 2025

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్?

image

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆ దేశ మీడియా తెలిపింది. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి, కాఠ్‌మండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ అథారిటీ మాజీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్మీకి Gen Z సూచించినట్లు తెలుస్తోంది.