News February 4, 2025

డిండి: కోడలు దాడిలో మామ మృతి

image

కోడలు దాడిలో మామ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని గోనబోయినపల్లిలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. ఇంటి ముందు కూర్చున్న బద్దె రాములు (65)ను కుటుంబ గొడవల కారణంగా పెద్ద కోడలు పెద్దులమ్మ కర్రతో కొట్టి రోడ్డుపై నెట్టి వేయిగా రాములు తల వెనుక భాగంతో తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Similar News

News February 4, 2025

నల్గొండ: తొలి రోజే 353 మంది డుమ్మా!

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ఉదయం 2375 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు హాజరుకాగా 257 మంది గైర్హాజరయ్యారు. మధ్యహ్నం నిర్వహించిన పరీక్షకు (జనరల్, ఒకేషనల్) 1915 మంది విద్యార్థులు హాజరుకాగా 96 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

News February 3, 2025

నల్గొండ: క్షుద్ర పూజల కలకలం

image

స్పేస్‌లోకి మనిషిని పంపే రోజులు వచ్చినా మూఢనమ్మకాలు, క్షుద్ర పూజలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని గుండ్రపల్లి రోడ్డు RDO కార్యాలయానికి వెళ్లే దారి వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణం చివర్లో మూడు రోడ్లు కలిసే చోట పసుపు, కుంకుమ, కోడిగుడ్డు, కొబ్బరికాయతో క్షుద్ర పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. 

News February 3, 2025

నల్గొండ: రేపటి నుంచి స్తంభగిరి బ్రహ్మోత్సవాలు

image

మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల స్తంభగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకులు మారేపల్లి నర్సింహా చార్యులు తెలిపారు. 8న రాత్రి కళ్యాణం, 12న రథోత్సవం జరుగుతుందని చెప్పారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు.