News March 26, 2025
డిచ్పల్లి: చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి: కలెక్టర్

మానవతా సదన్ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అనాధ బాలలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇది వరకు జిల్లాలో కలెక్టర్గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా తన హయాంలో 2016లో నెలకొల్పారు. మానవతా సదన్ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు.
Similar News
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
News March 29, 2025
NZB: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పోలీస్ శాఖ తరఫున విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రజలు శాంతి భద్రతల విషయంలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
News March 29, 2025
NZB: మీ సేవ సర్వర్ డౌన్తో ఇబ్బందులు

మీ సేవ సెంటర్లలో శనివారం సర్వర్ డౌన్ ప్రాబ్లమ్ ఎదురైంది. దీనితో మీ సేవ సెంటర్లకు వెళ్లిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లగా సర్వర్ డౌన్ చూపగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సెంటర్లలో పడిగాపులు కాశారు. కాగా రాజీవ్ యువ వికాస పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధిక సంఖ్యలో అభ్యర్థులు రావడంతో ఈ ఇక్కట్లు అని తెలిసింది.