News June 15, 2024

డిచ్‌పల్లి: సిగరెట్ కొని.. బంగారు గొలుసు లాక్కెళ్లి

image

ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు పుస్తెల తాడును లాకెళ్లిన ఘటన డిచ్పల్లి PS పరిధిలో శుక్రవారం జరిగింది. SI మహేష్ వివరాలిలా.. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో మొగుళ్ల వినోద కిరణా షాప్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి సిగరెట్ తీసుకొని రూ.50 ఇచ్చారు. తిరిగి డబ్బులు ఇచ్చే క్రమంలో మహిళ మెడలోంచి పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 29, 2026

మేడారం జాతరలో నిజామాబాద్ సీపీ బందోబస్త్

image

తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. రెండు రోజులుగా మేడారం జాతరలో నిజమాబాద్ సీపీ సాయి చైతన్య పోలీసు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.

News January 29, 2026

NZB: పార్టీలకు సవాలుగా మారిన అభ్యర్థుల ఎంపిక

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీంగల్ మునిసిపాలిటీలలో ప్రధాన పార్టీల మధ్యే పోటీ ఉండే అవకాశాలు ఉండగా అన్ని పార్టీల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం నేతలకు సవాలుగా మారింది. ఇప్పటికి ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అన్ని పార్టీల్లోనూ అభ్యర్థుల ఖరారు విషయంలో అనిశ్చితి నెలకొంది. ఆశావహులు మాత్రం తమకే పార్టీ టిక్కెట్ అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News January 29, 2026

నిజామాబాద్‌లో MIM కీ ‘రోల్’

image

నిజామాబాద్‌లో ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేందుకు AIMIM ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 16 స్థానాలు సాధించిన MIM.. 28 స్థానాలు సాధించిన BJPకి చెక్ పెడుతూ 13 స్థానాలు సాధించిన BRSతో పొత్తు పెట్టుకుంది. దీంతో మొహమ్మద్ ఇద్రీస్ ఖాన్ (AIMIM) డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవగా ఈ సారి కూడా తమ సత్తా చాటాలని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది.