News April 5, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాద్రి పర్యటన రద్దయింది. మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం రేపు ఉదయం వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి వారి కళ్యాణంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నేడు భద్రాద్రికి రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటన రద్దయినట్లు ఓ ప్రకటన జారీ అయ్యింది.
Similar News
News April 8, 2025
ములుగు: ‘వేసవి క్రీడల శిక్షణకు దరఖాస్తు చేసుకోండి’

ములుగు జిల్లాలో మే 1 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలలో 14 ఏళ్ల బాల బాలికలకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు గాను అర్హులైన వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి తెలిపారు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం అందజేస్తామని, ఆసక్తి గల వారు ఈ నెల 15లోగా జిల్లా సంక్షేమ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 8, 2025
వనపర్తి: తహశీల్దార్లు రేషన్ షాపులను తనిఖీ చేయండి: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీపై పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ఎక్కడా దొడ్డు బియ్యం, సన్న బియ్యం కలిపి పంపిణీ చేయవద్దని సూచించారు. అలాంటి పనులు ఎక్కడైనా జరిగితే చర్యలు తీసుకుంటామని సదరు రేషన్ షాపు డీలర్ లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తహశీల్దార్లు రేషన్ షాపులను విజిట్ చేసి తనిఖీలు చేయాలన్నారు.
News April 8, 2025
వనపర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి: కలెక్టర్

వరికోతలు ప్రారంభమైన అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సోమవారం కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రంలో తేమ, తూకం యంత్రాలు, టర్పాలిన్లు, గన్ని బ్యాగులు, ధాన్యం శుభ్రం చేసే మిషన్లు లేదా ఫ్యాన్లు కచ్చితంగా ఉండాలన్నారు.