News November 28, 2025

డిసెంబర్ 1న గ్లాస్ బ్రిడ్జి ప్రారంభోత్సవం

image

కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జిని డిసెంబర్ 1న ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. ‌రూ.7 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని పొడవు 55 మీటర్లు. ఒకే సమయంలో 100 మంది బరువును ఈ గ్లాస్ బ్రిడ్జి మోయగలదు. అయితే ముందు జాగ్రత్తగా 40 మంది చొప్పున బ్యాచ్‌లను అనుమతించనున్నారు. విశాఖకు పర్యాటకులు ఎక్కువమంది వచ్చే సీజన్ కావడంతో దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

Similar News

News November 28, 2025

మూవీ ముచ్చట్లు

image

* Netflixలో స్ట్రీమింగ్‌ అవుతున్న హీరో రవితేజ ‘మాస్ జాతర’
* రిలీజైన వారంలోనే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ మూవీ
* నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘ఆర్యన్’ చిత్రం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
* బాక్సాఫీస్ వద్ద గుజరాతీ చిత్రం ‘లాలో కృష్ణా సదా సహాయతే’ రికార్డులు.. రూ.50 లక్షలతో నిర్మిస్తే 49 రోజుల్లో రూ.93 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్

News November 28, 2025

రేపు మెదక్ స్టేడియంలో దివ్యాంగులకు క్రీడలు

image

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మెదక్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి వి.హేమ భార్గవి తెలిపారు. పరుగు పందెం, షాట్ పుట్, చెస్, కార్రమ్స్, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సమస్త దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.

News November 28, 2025

ప్రకృతి వ్యవసాయం.. బాపట్ల కలెక్టర్ ప్రశంసలు

image

అమృతలూరు మండలం గోవాడకు చెందిన మహిళా రైతు దుర్గాదేవి ప్రకృతి వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నారు. దీంతో శుక్రవారం బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆమెను ప్రశంసించారు. కేవలం 1 ఎకరం భూమిలో సహజ వ్యవసాయం చేస్తూ A-గ్రేడ్, ATM, PMDS పద్ధతులను సమర్థంగా అమలు చేస్తూ పంటల వైవిధ్యాన్ని పెంచారన్నారు. 30 రకాల విత్తనాలతో నెలకు రూ.1,21,000ల ఆదాయం అర్జిస్తూ రైతులకు ఆదర్శంగా నిలిచిందన్నారు.