News January 11, 2025
డి.హీరేహాళ్: పోలీసుల ఉరుకుల పరుగులు.. 2 గంటల్లో కేసు క్లోజ్

డి.హీరేహాళ్ మండలం జాజరకల్లుకు చెందిన నలుగురు మైనర్లు శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయారు. తల్లితండ్రులు వారిని మందలించారని ఇంటి నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు ఎస్సై గురుప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వెంకట రమణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. పిల్లలు కర్ణాటక రాష్ట్రం ఉలిగిలో ఉన్నట్లు గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు.
Similar News
News March 1, 2026
గుత్తి: వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ ప్రారంభం

రైల్వే ఇన్స్టిట్యూట్లో అందరికీ ఉపయోగపడే విధంగా వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ను ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ కం ఏడీఎంఈ అశోక్ గౌడ్, సెక్రెటరీ నయాబ్ రసూల్ చాట్ బాట్ సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైల్వే ఇన్స్టిట్యూట్ను రిజర్వ్ చేసుకోవడానికి, రూమ్స్ను బుక్ చేసుకోవడానికి 9652793707 వాట్సాప్ నంబర్ ద్వారా చేసుకొనే అవకాశాన్ని కల్పించామన్నారు.
News February 28, 2026
అనంత: హాకీలో సత్తా చాటిన యువకుడు యువన్ క్రిష్

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్లో యువకుడు యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువన్ క్రిష్ అండర్ 10 హాకీ వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
News February 28, 2026
కార్డుదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేసీ

అనంతపురం జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాలకు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం & సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. కార్డుదారులు తమకు దగ్గరలో ఉన్న ఏ చౌక ధరల దుకాణం వద్దనైనా నిత్యావసర సరుకులను పోర్టబిలిటీ ద్వారా పొందవచ్చన్నారు.


