News November 13, 2024
డీఆర్డీఎల్ను సందర్శించిన రాధా మోహన్ సింగ్

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో కమిటీ సభ్యులు బుధవారం హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీ (DRDL)ని సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్షిపణి ప్రదర్శన కేంద్రాన్ని ఛైర్మన్ ప్రారంభించారు. భారతదేశం రక్షణ సాంకేతికతలలో కొనసాగుతున్న పురోగతిని సమీక్షించడం, క్షిపణి అభివృద్ధిలో భవిష్యత్తు పరిశోధన దిశలను అంచనా వేయడం ఈ పర్యటన లక్ష్యమన్నారు.
Similar News
News March 3, 2026
HCUలో PhDకి దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ (HCU) PhD కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దాదాపు 13 కోర్సుల్లో కోర్సులు చేసేందుకు అవకాశముంది. ఆసక్తి, అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. కోర్సులు, అర్హత వివరాలు, ఫీజు తదితర వివరాలు వర్సిటీ వెబ్సైట్లో <
News March 3, 2026
JNTUHలో 45 మంది అధ్యాపకులకు పదోన్నతులు

JNTUHలో కెరీర్ CAS కింద 45 మంది బోధనా అధ్యాపకులకు పదోన్నతులు లభించాయి. VC డా. టి. కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ డా.కె. విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డా. కె. వెంకటేశ్వరరావు సమక్షంలో ఆర్డర్ కాపీలు అందజేశారు. సీనియర్ ప్రొఫెసర్గా 9 మంది, ప్రొఫెసర్లుగా 20 మంది, అసోసియేట్ ప్రొఫెసర్గా 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ హయ్యర్ గ్రేడ్ పే పొందారు.
News March 3, 2026
కీసరగుట్ట ఆలయ గోపురంపై అద్భుత దృశ్యం

నగర శివారులోని ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న కీసరగుట్ట శ్రీభవాని శివదుర్గా సమేత రామలింగేశ్వర స్వామి గుడిలో సోమవారం రాత్రి అద్భుత దృశ్యం కనివిందు చేసింది. స్వామివారి గుడి శిఖరంపై పౌర్ణమి చంద్రుడిని చూసిన భక్తులు పరవశించిపోయారు. అనంతరం శివయ్యను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని బంధనం చేశారు.


