News May 24, 2024

డీఈఓ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి: జేసీ

image

ఈ నెల 25వ తేదీ నిర్వహించనున్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని శుక్రవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నంద్యాలలో మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 605 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారని తెలిపారు. పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులు ఉదయం 7.30 గంటల నుంచి 8.15 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

Similar News

News October 2, 2025

ఈ విషాదానికి 16 ఏళ్లు

image

2009 అక్టోబర్ 2న తుంగభద్ర, హంద్రీ నదుల ఉద్ధృతితో అతలాకుతలం చేసిన వరద కర్నూలు నగరాన్ని ముంచెత్తింది. ఇళ్లూ, ఆస్తులు, జ్ఞాపకాలు నీటిలో కొట్టుకుపోయాయి. అనేక కుటుంబాలు రోడ్లను ఆశ్రయించగా, వేలాది మంది తమ బంధువులను, జీవనాధారాలను కోల్పోయారు. నేటికి 16 ఏళ్లు గడిచినా ఆ భయం, బాధలు మిగిలే ఉన్నాయి. ఆ కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ నగర ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

News October 2, 2025

ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: జేసీ

image

ఈనెల 15న రేషన్ షాప్ డీలర్ల వద్ద స్మార్ట్ రేషన్ కార్డులు పొందవచ్చని జేసీ డా.బి.నవ్య వెల్లడించారు. 16వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారన్నారు. బుధవారం కర్నూలులోని బుధవార పేటలో ఎఫ్‌సీ షాపులను తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా రేషన్ డీలర్లు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 2, 2025

ప్రధాని పర్యటన నేపథ్యంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

ఈ నెల 16న ప్రధాని జిల్లాలో పర్యటించనున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. పర్యటనకు సంబంధించి ఇంకా అధికారికంగా షెడ్యూల్ విడుదల కాలేదన్నారు. నగరంలో 4,000 మందితో రోడ్ షో ఉండే అవకాశం ఉందన్నారు.