News October 10, 2024
‘డీసీసీబీ ద్వారా రూ.2350 కోట్ల విలువైన సేవలు అందించాం’

ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు ద్వారా రైతులకు ఇప్పటివరకు రూ.2,350 కోట్ల సేవలు అందించడం జరిగిందని ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. డీసీసీబీ గజ్వేల్ శాఖ పూర్తి చేయడంతో బ్యాంకు మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా సంఘాలకు రుణాలు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీబీ బ్యాంకు 400 కోట్ల టర్నోవర్ ఉండగా ప్రస్తుతం రూ.2,350 కోట్లకు చేరుకుందన్నారు.
Similar News
News February 28, 2026
మెదక్: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.
News February 28, 2026
మెదక్: 9 నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు

మెదక్ జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు. బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న రుణ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News February 28, 2026
మెదక్: మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్కు ఘనంగా వీడ్కోలు

రెండేళ్ల పాటు మెదక్ కలెక్టర్గా పనిచేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్గా బదిలీ అయిన రాహుల్ రాజ్కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులు, విప్లవాత్మక నిర్ణయాలతో మెదక్ జిల్లాను రాహుల్ రాజ్ రోల్ మోడల్గా నిలిపారని కొనియాడారు. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారని అధికారులు గుర్తు చేసుకున్నారు.


