News April 8, 2025

డుంబ్రిగూడ: డిప్యూటీ సీఎంకు ఉపాధి సిబ్బంది వినతి

image

డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో మంగళవారం పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అల్లూరి జిల్లా ఉపాధి సిబ్బంది తమ బాధలను ఏకరువు పెట్టారు. చాలీచాలని జీతాలతో గత 20ఏళ్ళు పైబడి పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా ఇబ్బందిగా మొర పెట్టుకున్నారు. పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర అలవెన్సులు మంజూరు చేయాలని కోరారు.

Similar News

News April 17, 2025

నెల్లూరులో వ్యభిచారం గుట్టురట్టు

image

నెల్లూరులోని వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన మహిళ నెల్లూరు హరనాథపురం శివారులోని ఓ అపార్ట్‌మెంట్లో ఇంటిని రెంట్‌కు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు దాడి చేశారు. ఆమెతో పాటు విటుడు మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

News April 17, 2025

ధర్మవరం రూట్‌లో పనులు.. పలు రైళ్లు రద్దు

image

ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పుట్టపుర్తి-తిరుపతి కనెక్షన్ పాయింట్స్, పాయింట్ ఛేంజింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. దీంతో గుంతకల్లు-తిరుపతి, తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైళ్లు బుధవారం నుంచి మే 17వరకు రద్దయ్యాయి. ఈ మార్గంలో వెళ్లే మరిన్ని రైళ్లను గుత్తి మీదుగా రేణిగుంటకు మళ్లించారు. ఇక నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ కదిరి-నర్సాపూర్‌ మధ్య రాకపోకలు సాగించనుంది.

News April 17, 2025

సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు: సీఐ

image

మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్ట్ పెట్టిన వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండవ పట్టణ సీఐ రామచంద్ర తెలిపారు. మదనపల్లె‌లోని శివాజీ నగర్‌లో ఉండే మహబూబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు ఎక్స్‌లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

error: Content is protected !!