News February 9, 2026
డెడ్లైన్లోపు నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా

ఆర్థిక నెట్వర్క్లను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలిచ్చాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. భద్రతా వ్యూహాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకంగా మారాయన్నారు. మార్చి 31లోపు దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ రాయపూర్లో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలపై పలు రాష్ట్రాల, కేంద్ర సంస్థల ఉన్నతాధికారులతో సమీక్షించినట్టు SMలో పోస్ట్ పెట్టారు.
Similar News
News February 9, 2026
డ్రైవర్ నిర్లక్ష్యం.. 30 మంది మృతి

నైజీరియాలోని కానోలో ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 30 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. గాయపడినవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ దేశంలో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, ట్రాఫిక్ చట్టాలు అమలు చేయడంలో వైఫల్యం వల్ల తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
News February 9, 2026
ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న నటుడు!

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్’ మూవీ నుంచి నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుంచి ఆయన వైదొలిగినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతకుముందు దీపికా పదుకొణే తప్పుకోగా ఆమె స్థానంలో హీరోయిన్గా తృప్తి దిమ్రిని తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల కానుంది.
News February 9, 2026
అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు: పొన్నం

TG: అసంపూర్తిగా ఉన్న బెడ్ రూం ఇళ్లను పూర్తి చేసి అర్హత కలిగిన వారికి ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. KNRలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున ఇచ్చామని తెలిపారు. దీంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


