News September 20, 2025

డేంజర్ చికెన్.. నిర్వాహకుడిపై కేసు నమోదు

image

అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్‌లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Similar News

News September 20, 2025

రాష్ట్రస్థాయి స్కూల్ రగ్బీ పోటీలకు అనంతపురం జిల్లా విద్యార్థులు

image

రాష్ట్రస్థాయి స్కూల్ రగ్బీ పోటీలకు అనంతపురం జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ పాఠశాలకు చెందిన హిమబిందు (అండర్-14), హేమసాయి, సుస్మిత (అండర్-17), రుషిందర్, నందిని (అండర్-19) సెలెక్టయ్యారు. స్టాండ్ బైగా చక్రి, వరుణ్ సందేశ్ వ్యవహరిస్తారు. విద్యార్థులను HM నీరజ, పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, సువర్ణ అభినందించారు.

News September 20, 2025

బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

పేద ప్రజలకు అందాల్సిన లబ్ధి అర్హులైన వారికి తప్పకుండా అందాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషన్ అభియాన్ నిర్దేశిత లక్ష్యాలు అమలు అయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 19, 2025

సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

image

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.