News June 29, 2024
డైట్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్: ప్రిన్సిపల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719588549681-normal-WIFI.webp)
డైట్లో డిప్లమో కోర్స్ ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్కు ఈనెల 30 నుంచి జూలై 4 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎం.జ్యోతి కుమారి తెలిపారు. మొదటి విడత వెబ్ఆప్షన్స్ ఇవ్వనివారు, మొదటి విడతలో సీటు రానివారు.. ఈ అవకాశం వినియోగించుకోవచ్చని చెప్పారు. వీరికి జూలై 5 నుంచి ఏడో తేదీ వరకు సీట్లు కేటాయింపు ఉంటుందని, జూలై 9 నుంచి 13 వరకు ప్రవేశాలు కల్పిస్తామని జ్యోతికుమారి తెలిపారు.
Similar News
News July 1, 2024
విశాఖ సీపీగా బాధ్యతలు స్వీకరించిన శంకబ్రత బాగ్చీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719802376647-normal-WIFI.webp)
విశాఖ సీపీగా శంకబ్రత బాగ్చీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వైజాగ్లో పని చెయ్యడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు. తనకు ఇక్కడ పని చెయ్యడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు పెళ్లి అయ్యాక హనీమూన్ ఎక్కడకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరూ స్విట్జర్లాండ్ వెళ్లాలన్నారు కానీ.. అప్పుడు డబ్బులు లేకపోవడంతో విశాఖనే ఎంచుకున్నాని తెలిపారు.
News July 1, 2024
విశాఖ నగరానికి తలమానికంగా క్లాక్ టవర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719774876474-normal-WIFI.webp)
విశాఖ మహా నగరానికి జగదాంబ జంక్షన్లో ఏర్పాటు చేసిన క్లాక్ టవర్ తలమానికంగా నిలిచింది. నగరాభివృద్ధిలో భాగంగా అధికారులు సుందరీకరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగరంలోని అతి ముఖ్యమైన జగదాంబ సెంటర్లో క్లాక్ టవర్ను నూతనంగా నిర్మించారు. ఈ టవర్ చుట్టూ విద్యుత్ దీపాలను అందంగా అలంకరించారు. ఈ క్లాక్ టవర్ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
News July 1, 2024
తగ్గుముఖం పట్టిన పర్యాటకుల తాకిడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719789894670-normal-WIFI.webp)
ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు పర్యాటకుల తాకిడి తగ్గింది. గతవారం రోజులుగా బొర్రాను సందర్శించేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ ఆదివారం 1,700 మంది సందర్శించగా రూ.1.57 లక్షల ఆదాయం వచ్చిందని మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. తాటిగూడ, కటికి, డముకు వ్యూపాయింట్ తదితర సందర్శిత ప్రాంతాలన్నీ ఈవారం వెలవెలబోయాయి. వేసవిసెలవులు ముగియడంతో పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. దీంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతుంది.