News December 21, 2025
డైట్ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి: కలెక్టర్

కోహెడ మండలంలోని తంగళ్ళపల్లిలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో సందర్శించి రాత్రి భోజనం వసతిని పరిశీలించారు. వంట గదికి వెళ్లి రాత్రి భోజనానికి సంబంధించి ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు అందించారా, సన్నబియ్యం నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. కామన్ డైట్ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.
Similar News
News January 7, 2026
జగన్తో తానేటి వనిత భేటీ.. చోడవరం ఫ్లెక్సీ వివాదంపై సుదీర్ఘ చర్చ!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తానేటి వనిత మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా చోడవరం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఫ్లెక్సీల వివాదం, అనంతరం తలెత్తిన పరిస్థితులను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
News January 7, 2026
రష్యా నుంచి భారత్ దిగుమతులు రూ.17లక్షల కోట్లు

ఉక్రెయిన్తో పూర్తిస్థాయి యుద్ధం మొదలైన నాటి నుంచి సుమారు రూ.15 లక్షల కోట్ల విలువైన చమురు, రూ.1.91 లక్షల కోట్ల విలువైన బొగ్గు రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్టు సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అంచనా వేసింది. చైనాకు 293.7 బిలియన్ యూరోల విలువైన చమురు, గ్యాస్, బొగ్గును రష్యా అమ్మింది. 2022 నుంచి ప్రపంచ శిలాజ ఇంధన అమ్మకాలతో రష్యా రూ.85-95 లక్షల కోట్లు సంపాదించినట్లు పేర్కొంది.
News January 7, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓టేకులపల్లి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✓అశ్వరావుపేట మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలి: జిల్లా కార్యదర్శి
✓దమ్మపేట: ఆలయం పక్కన మద్యం దుకాణం తొలగించాలి: బీజేపీ
✓పంట వ్యర్ధాలతో బయోచార్ తయారీ: కలెక్టర్
✓ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు సమర్పించాలి: కలెక్టర్
✓కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: భద్రాద్రి ఎస్పీ
✓జూలూరుపాడు వైద్యశాలను తనిఖీ చేసిన DM&HO
✓చైనా మాంజా వాడొద్దు: భద్రాచలం ఏఎస్పీ


