News April 16, 2025

డోన్ మండలంలో బాలికపై అత్యాచారం!

image

బాలికపై అత్యాచారం జరిగిన ఘటన డోన్ మండలంలో జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా బంధువైన విష్ణువర్ధన్ కొత్త దుస్తులు కొనిస్తానని ఇంటికి తీసుకెళ్లాడు. లైంగిక దాడికి పాల్పడి తర్వాత ఇంటి వద్ద వదిలిపెట్టాడు. బాలిక నీరసంగా ఉండటంతో తల్లి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని కుమార్తె వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఎస్సై శరత్ తెలిపారు.

Similar News

News March 1, 2026

విజయవాడలో వివాహిత సూసైడ్

image

కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలోని మాచవరంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మృతురాలు బజినున్నీసా కిషోర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. శనివారం రాత్రి వీరిరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. మనస్తాపానికి గురైన ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI దుర్గ భవాని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News March 1, 2026

ADB: మోదుగు పూలతో.. చిన్నారుల హోలీ కేలీ

image

రంగుల పండుగ హోలీకి ఉమ్మడి ADBలోని చిన్నారులు సరికొత్తగా సిద్ధమవుతున్నారు. మార్కెట్లో లభించే రసాయన రంగులకు స్వస్తి పలికి, ప్రకృతి ప్రసాదించిన మోదుగు పూలతో రంగులను స్వయంగా తయారు చేస్తున్నారు. అడవిలో లభించే ఈ పూలను సేకరించి, వాటిని నీటిలో మరిగించి పర్యావరణహిత కాషాయం, పసుపు వర్ణపు రంగులను రూపొందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్న ఈ చిన్నారుల ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

News March 1, 2026

ఇవి ప్రభుత్వం ఇస్తున్న పక్కా ఇళ్లు!

image

ప్రకృతి విపత్తు వందలాది మందిని నిరాశ్రయులను చేస్తే కేరళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి బాధితుల జీవితాల్లో కొత్త ఆశలను నింపింది. వయనాడ్ బాధితుల కోసం ప్రభుత్వం నిర్మించిన అద్భుతమైన టౌన్‌షిప్ ఇవాళ ప్రారంభంకానుంది. ముండక్కై-చూరల్మల కొండచరియలు కూలడంతో ఇళ్లు కోల్పోయిన 178 కుటుంబాలకు మొదటి దశలో అన్ని సౌకర్యాలతో కూడిన 51 నూతన గృహాలను సీఎం పినరయి అందజేశారు. ఒక్కో ఇంటిపై రూ.26లక్షలు ఖర్చు చేశారు.